అడుక్కుంటే నేనే నాలుగు సీట్లు ఇస్తాను : కేసీఆర్

Update: 2018-10-03 12:41 GMT

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు. సిగ్గులేకుండా తెలంగాణను నాశనం చేసినవారితోనే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రవాళ్లకు అధికారం అప్పగిస్తారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడికి పదును పెట్టి ఎన్నికల ప్రచారంలో హీట్ రాజేశారు. తెలంగాణను నాశనం చేసినవాళ్లతో పొత్తు పెట్టుకోవడం కన్నా తనను అడిగితే, నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మోద్దన్నారు కేసీఆర్.
 

Similar News