ప్రణయ్ దారుణ హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రణయ్ పరువు హత్యను అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు కులం అనే అహంతో ప్రియుడ్ని కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ హత్య ఘటన దారుణమన్న ముఖ్యమంత్రి సమాజంలో కులాంతర వివాహాలు పెరగాలని అన్నారు. నచ్చినవాడిని చేసుకుంటే తల్లిదండ్రులు ఆశీర్వదించాలి కానీ చంపడం దుర్మార్గమన్నారు. కులంతార వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాము 'పెళ్లికానుక'ను ప్రారంభించామని బాబు చెప్పారు.