తిరుమల సంప్రోక్షణ వివాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు

Update: 2018-07-17 04:36 GMT

తిరుమల పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ, సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. సంప్రోక్షణ సమయంలోనూ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని, గతంలో మహా సంప్రోక్షణ సమయంలో పాటించిన నిబంధనలను అనుసరించాలని ఆయన సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, పూజాది కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

Similar News