యాభై శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్, అందరూ వ్యతిరేకించడంతో తోకముడిచారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైలులో ఉండాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారని, జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని పేరూరు ప్రాజెక్ట్ నీటిని కాల్వకు భూమిపూజ చేసిన సీఎం ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై పోరాడుతున్నామని తెలిపారు. ధర్మం మనవైపు ఉంది కనుకే ధర్మపోరాట దీక్షకు దిగామని, ఏదైనా విషయంపై పోరాడాల్సి వస్తే తన తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.