హైదరాబాద్ ను తానే కట్టానని అనడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేసీఆర్ నన్ను చూసి ఎగతాళి చేశారన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్ తప్ప ఏమీ నిర్మించలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైబరాబాద్ తన మానసపుత్రిక అని అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దానని బాబు చెప్పారు. హైదరాబాద్ లో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రపంచంలోనే ఓ అద్భుతమన్నారు.అమరావతి ప్రజావేదికలో భాగంగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. 2024 కోసం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని సూచించారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.