ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో షాకిచ్చింది. విశాఖ రైల్వే జోన్ అంశంపై నీళ్లు చల్లింది. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని... తెలుగు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశంలో...కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ తేల్చి చెప్పారు. రైల్వే జోన్ నివేదికలు, సర్వేలన్ని వ్యతిరేకంగా ఉన్నాయన్న కేంద్రం....నివేదికలు సానుకూలంగా లేనపుడు జోన్ ఏర్పాటు సాధ్యపడదన్నారు.