హుజూర్నగర్ ఆంధ్రాబ్యాంకులో క్యాషియర్ చేతివాటం...60 లక్షలతో నిందితుడు పరారీ
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆంధ్రాబ్యాంక్లో గోల్మాల్ జరిగింది. బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న గంగాధర్ రామకృష్ణ చేతివాటం ప్రదర్శించాడు. ఏటిఎంలో పెట్టే నగదులో అవకతవకలకు పాల్పడ్డాడు. మొత్తంగా 58 లక్షల 89 వేల 200 రూపాయలతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. రంగంలో దిగిన పోలీసులు గంగాధర్ కోసం గాలిస్తున్నారు.