కారులోకి వర్షపు నీరు.. ఊపిరాడక డ్రైవర్‌ మృతి

Update: 2018-06-23 05:12 GMT

హైదరాబాద్ నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షం ఒకరిని బలిగొంది. కూకట్ పల్లి జయనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో  సెలార్‌లోకి నీరు రావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సెల్లార్‌లో కార్ పార్క్ చేసి అందులోనే డ్రైవర్ గోపి  నిద్రపోయాడు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి  వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి సెల్లార్‌లో చేరింది. దీంతో కారులో నిద్రిస్తున్న డ్రైవర్ నీట మునిగి చనిపోయాడు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న  కారు యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.  ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో కారులోనే నిద్రపోయినట్టు కారు యజమాని పోలీసులకు వివరించారు. 

Similar News