రైల్వేజోన్‌ తెచ్చితీరుతాం: కేంద్రమంత్రి సుజనా

Update: 2018-02-01 11:26 GMT

ఏపీకి బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. విశాఖ, విజయవాడ మెట్రోను ప్రస్తావించలేదని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని సుజనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి నిధులు తీసుకొచ్చేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామన్న సుజనా చౌదరి.. రైల్వే జోన్ తెచ్చి తీరుతామన్నారు. బడ్జెట్‌పై ఆదివారం (4వ తేదీ) ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ అత్యవసర భేటీ అవుతుందన్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు చివరి వరకు కృషిచేస్తామని సుజనా చౌదరి పేర్కొన్నారు.
 

Similar News