భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. దమ్మపేట మండలం నెమిలిపేటలో ప్రవల్లిక అనే విద్యా వాలంటీర్ పై కత్తితో దాడి చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవల్లికను ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.