ఫ్రత్యేక హోదా కోసం సరైన సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని విశాఖలో స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా బీజేపీతో మైత్రి కొనసాగిస్తూ దండం పెడతామనడం, కోర్టుకు వెళ్తామనడం ఏమిటని నిలదీశారు. సీఎం పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమన్నారు బొత్సా.