మా పెళ్లికి రండి

Update: 2018-05-25 08:20 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను గురువారం ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి వచ్చి ఆగష్టులో జరగబోయే తమ మ్యారేజ్‌కి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులను కేటీఆర్ అభినందించారు. వారికి జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖిలప్రియ తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తాను 2009-2014 మధ్య శాసనసభ్యులుగా పనిచేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.  

Similar News