కేసీఆర్ థర్డ్ ఫ్రంట్పై అనుమానాలు వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. థర్డ్ ఫ్రంట్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారన్న సందేహం వ్యక్తమవుతోందన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కేసీఆర్ ఈ ప్రకటన చేశారన్నారు. జరగబోయే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ప్రభావం దేశరాజకీయాలపై ఉంటుందని, కర్ణాటకలో సిద్దరామయ్యే మళ్లీ గెలుస్తాడని చెప్పారు అచ్చెన్నాయుడు.