ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తన శుభాకాంక్షలను ఫేస్ బుక్ వేదికగా తెలిపారు. అన్నయ్య, వదినమ్మలకు వివాహ వార్సికోత్సవ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ పెట్టన షర్మిల.. జగన్, భారతి దంపతుల పెళ్లినాటి ఫోటోను, శుభలేఖను షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైఎస్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.