అసెంబ్లీ వేదికగా రాజధానిపై సీఎం జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వికేంద్రీకరణ విధానం మంచిదన్న జగన్ మనం కూడా మారాల్సిన అవసరముందన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తుచేసిన జగన్మోహన్రెడ్డి ఏపీలో మూడు కేపిటల్స్ పెట్టుకోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో లేజిస్టేటివ్ కేపిటల్ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ పెట్టుకోవచ్చన్నారు. ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ వస్తాయేమోనన్న సీఎం జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు.