చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు

Update: 2019-10-14 07:33 GMT

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు శివారు పూజారివారి గరువులో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి నితిన్ ప్రాణాలు కోల్పోయాడు. బాలకృష్ణ, సుశీల దంపతుల ఇద్దరు కుమారుల్లో పెద్దవాడిని స్కూల్‌ బస్సు ఎక్కిస్తుండగా నితిన్ అనే మూడేళ్ల చిన్నారి స్కూల్‌ బస్సు చక్రాల కింద పడ్డాడు. అంతలోనే బస్సు బాలుడి తలపై నుండి వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో పూజారివారి గరువులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్రకుమార్‌ తెలిపారు. 

Tags:    

Similar News