వివేకా హత్య కేసు విచారణ వేగవంతం.. సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి

Update: 2019-12-12 10:42 GMT

వై.ఎస్. వివేకా హత్య కేసు విచారణ వేగవంతమైంది. కొద్దిరోజులుగా కీలక వ్యక్తులను సిట్ బృందం విచారిస్తోంది. సిట‌్ విచారణకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి హాజరయ్యారు. తనను గంటన్నరపాటు సిట్ విచారించిందని ఆది నారాయణరెడ్డి వెల్లడించారు. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని చెప్పారు. వివేకా హత్యపై సిబిఐ విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News