బ్రేకింగ్ న్యూస్ : టీడీపీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్‌బై

Update: 2019-10-27 10:22 GMT

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఇన్నాళ్లు టీడీపీకి విధేయుడిగా పని చేశానన్నారు వంశీ. గత కొన్ని రోజులుగా వంశీ రాజీనామా చేసి వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను వంశీ పంపారు. అంతేకాదు రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు బాబుకు రాసిన లేఖలో నిశితంగా వివరించారు. స్థానిక వైసీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులను కాపాడుకోవటానికే రాజకీయాల నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News