విజయవాడ సీపీని కలిసిన వల్లభనేని వంశీ

Update: 2019-11-15 09:36 GMT

టీడీపీ బహిష్కృత నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలతో పాటు ఫోటో మార్ఫింగ్‌పై కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన సీపీకి అందజేశారు. పలు వెబ్‌సైట్ల పేర్లను కూడా ఆయన తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు' అని ఎమ్మెల్యే తెలిపారు.

Tags:    

Similar News