ప్రభుత్వ వైఫల్యాలపై 'ఇదేం కర్మ'

Chandrababu: ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

Update: 2022-11-19 03:01 GMT

ప్రభుత్వ వైఫల్యాలపై ‘ఇదేం కర్మ’

Chandrababu: టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. భవిష్యత్‌ కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. 'రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ' కార్యక్రమాన్ని ఈ సమావేశంలో చంద్రబాబు ప్రారంభించనున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే నిమిత్తం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

Tags:    

Similar News