క్రిస్మస్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పిల్లలకు గిఫ్ట్ ప్యాక్లను బహూకరించారు. హైదరాబాద్తోపాటు అదే రోజు అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో లబ్బిపేట ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హొంమంత్రి సుచరిత, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.