ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెప్పాల్సింది చెప్పాం బంతి ఇప్పుడు వంశీ కోర్టులోనే ఉంది నిర్ణయం ఆయనే ప్రకటించాల్సి ఉందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. రాజకీయంగా రాటుదేలాలంటే ఒత్తిళ్లు సహజమేననన్న ఆయన వీరోచితంగా పోరాడి గెలిచి ఇప్పుడు వెన్ను చూపడం మంచిదికాదన్నారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి వంశీ అంతే అవసరమన్నారు. వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు ఎంపీ కేశినేని నాని.