తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో ఆవేదన వ్యక్తంచేసింది. కేసీఆర్, జగన్ ఇద్దరి పోకడలూ ఒకేలా ఉన్నాయన్న తెలుగుదేశం నేతలు మీడియా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దన్న అహంకారంతో కేసీఆర్, జగన్ వ్యవహరిస్తున్నారని ఇద్దరు ముఖ్యమంత్రుల నియంతృత్వ పోకడలపై మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు సోమిరెడ్డి.