ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది. ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19వేల 170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, నవంబర్ 10 వరకు దరఖాస్తులు పరిశీలిస్తారని, నవంబర్ 16 నుండి 20 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. నవంబర్ 22న ఎంపికైన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటిస్తారని, డిసెంబర్ 1 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.