రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ఎస్పీలు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, వంద మంది కానిస్టేబుల్స్, 50 మంది మహిళా పోలీసులు విధుల్లో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
గతంలో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటనలో కాన్వాయ్పై దాడి జరిగింది. ఆందోళనకారులు ఓ రాయి, చెప్పు విసిరారు. దీంతో ఈ ఘటన వివాదానికి దారి తీసింది. తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రత్యేక విచారణ బృందం అప్పటి ఘటనపై దర్యాప్తు చేస్తోంది.