ఆయేషా మీరా భౌతికకాయానికి రీ-పోస్టుమార్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నం ప్రైవేటు హాస్టల్లో తెనాలికి చెందిన ఆయేషా అత్యాచారంతో పాటు హత్యకు గురైంది. కేసు పునర్విచారణలో భాగంగా భౌతిక కాయానికి రీ పోస్టుమార్టం చేయించాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. రేపు ఆయేషా మృతదేహాన్ని ఖననం చేసిన తెనాలి బరియల్ గ్రౌండ్కు సిబిఐ అధికారులు, తల్లిదండ్రులు వెళ్లే అవకాశం ఉంది. రీపోస్టుమార్టంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.