సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ముఖ్యంగా పండుగ మూడు రోజులు ఇక్కడ భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు. పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి మరి కోడి పందాలు నిర్వహిస్తారు. అయితే కోడి పందాల నిర్వహణపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పందాలను ప్రారంభించారు. కోడి పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో భాగమని తెలిపారు. కోడి పందాల బెట్టింగులకు తాను వ్యతిరేకమని బెట్టింగుల పేరుతో కోడి పందాలను అడ్డుకోవద్దని కోరారు రఘురామకృష్ణం రాజు.