టీటీడీ ఛైర్మన్ పదవికి ఎట్టకేలకు పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన పుట్టా రాజీనామా లేఖను టీటీడీ ఈవో సింఘాల్కు పంపారు. ఇప్పటివరకు రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న పుట్టా ఆర్డినెన్స్తో టీటీడీ బోర్డును తొలగిస్తామంటూ మంత్రి వెల్లంపల్లి ప్రకటించిన నేపథ్యంలోనే పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పుట్టా రాజీనామాతో ప్రస్తుత టీటీడీ పాలక మండలి పూర్తిగా రద్దయినట్లయ్యింది.