గన్నవరం రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. వంశీ రాజీనామా లేఖలో పార్టీ మార్పుపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ, వైసీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. గన్నవరంలోని పరిస్థితులను వివరించడానికి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. వంశీ నిర్ణయంపై యార్లగడ్డ భవితవ్యం ఆధారపడి ఉంది. నేడు వంశీ గన్నవరం రానున్నారు. వంశీతో ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల బేటీ కానున్నారు. వారు వంశీని బుజ్జగించనున్నారు.