చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా రైతులతో పవన్కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్న పవన్ రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తానని హెచ్చరించారు. మత మార్పిడీల మీద ఉన్న ఉత్సాహం రైతులపై ఎందుకు లేదని ప్రశ్నించారు పవన్కల్యాణ్.