బలవంతంగా ఇంగ్లీష్ మీడియాన్ని రుద్దితే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్

Update: 2019-11-13 12:36 GMT

హిందీని జాతీయ భాషగా అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తే పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయని జనసేనాని పవన్ గుర్తుచేశారు. అలాంటిది బలవంతంగా ఇంగ్లీష్ మీడియాన్ని తెలుగు విద్యార్ధులపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ఊరికి ఒక్క తెలుగు మీడియం విద్యార్ధి ఉన్నా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాల్సిందేనని, అలా కాకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదని మరోసారి జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా పాడు రాజకీయాలు చేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. స్కూళ్లలో ఆడపిల్లల కోసం కనీసం బాత్రూమ్స్ కూడా లేవని పవన్ ఆరోపించారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతిని చంపేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News