బోటు వెలికితీతలో పురోగతి.. ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట డ్రైవర్ క్యాబిన్

Update: 2019-10-21 10:25 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీతలో మరింత పురోగతి సాధించారు. ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్ లను బోటుకు కట్టి, బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. మరి కాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీస్తారని భావిస్తున్నారు. మరోవైపు, గోదావరి నీటిమట్టం 38 నుంచి 40 అడుగుల మేర మాత్రమే ఉండటంతో బోటును వెలికి తీసుకొచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News