పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోయిన మొక్కలకు ప్రధాన కాలువ నుండి కావిడితో నీళ్లు తెచ్చి మొక్కలకు పోసి తన నిరసనను వ్యక్తం చేశారు.
మనిషి మనుగడకు ఆక్సిజన్ ఎంతో అవసరమని లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటితే కనీసం ఈ ప్రభుత్వం వాటికి బిందెడు నీరు కూడా పోయలేకపోవడం దారుణమన్నారు. మొక్కలను నాటాలని వాటిని సంరక్షించాలని ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి మొక్కలను కాపాడాలని డిమాండ్ చేశారు.