తిరుమలలో బాబు ఒక్కసారైనా గుండు చేయించుకున్నారా? : మంత్రి కొడాలి నాని

Update: 2019-11-22 11:20 GMT
కొడాలి నాని

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుమల వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకివ్వాలో చంద్రబాబు చెప్పాలన్నారు.

జగన్ ఒక మతానికో ఒక కులానికో ముఖ్యమంత్రి కాదని డిక్లరేషన్ ఇవ్వడానికి అన్నారు. వెంకటేశ్వరస్వామి కుల దైవమని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా తిరుమల కొండపై గుండు చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఓటమిని జీర్జించుకోలేకే మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తిరుమల లడ్డూను మద్యాన్ని ఒకేలా పోల్చినందుకు అలిపిరి దగ్గర కొండకు తల బాదుకుని క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి కొడాలి నాని‌.

Full View

Tags:    

Similar News