ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లారు. డిసెంబర్ 6వ తేదీ వరకూ సెలవు పెట్టారు. అయితే బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా కొత్త బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై వెళ్లారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి ( హెచ్ఆర్డీ) సంస్థకు డైరెక్టర్ జనరల్గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎన్ను ఆకస్మికంగా బదిలీ చేయడం, అధికార, రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఆయన నెలరోజుల పాటు సెలవుపై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.