విజయవాడలో విషాదం నెలకొంది. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాంధీనగర్ జగపతి హోటల్ ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు ఓ ప్రైవేట్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.