కీలక దశకు చేరుకున్న బోటు వెలికితీత పనులు..నదీ గర్భంలోకి ఆక్సిజన్తో ప్రవేశించిన డైవర్స్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత ఆపరేషన్ వేగవంతమైంది. విశాఖకు చెందిన డైవర్స్ నదీగర్భంలోకి ఆక్సిజన్ తో దిగి బోటు వెనుకబాగానికి ఐరన్ రోప్ కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలమైతే బోటును ఫొక్లైన్ తో బయటకు లాగుతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సోమవారం బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్ డైవర్లు చెప్పారు.