ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్కు పరిపాలనా అనుభవం లేదన్న జేసీ ఆయన చేస్తున్న పనుల్లో మంచీచెడు చెప్పేందుకు ఎవరూ లేరేమో అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా జగన్ మనస్తత్వం ఉందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రజలు మార్పు కోరుకోవడంతోనే జగన్ కు అన్ని సీట్లు వచ్చాయన్న జేసీ ఏడాది గడిస్తేనే గానీ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఏమీ చెప్పలేమన్నారు.