బీజేపీ, జనసేన కీలక భేటీ ముగిసింది. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. మూడున్నర గంటల పాటు సాగిన చర్చల్లో అమరావతిపై పోరాటం, అంశాలవారీగా పొత్తులపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సహా మరికొందరు నేతలు పాల్గొనగా బీజేపీ తరపున ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోదర్, సోము వీర్రాజు, పురంధేశ్వరి పాల్గొన్నారు. సమావేశంలో ఖరారు చేసిన అంశాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు.