ఆపరేషన్ కచ్చులూరులో మరోసారి విరామం ఎదురైంది. నిన్న లంగర్కు భారీ వస్తువు తగిలిందని అది బోటు అయి ఉండొచ్చని అనుకున్న ధర్మాడి సత్యం బృందానికి మళ్లీ నిరాశే ఎదురైంది. లంగరు ఊడొచ్చిందని కానీ ఆ వస్తువు ఎంతకూ బయటకు రాలేదు. దీంతో ఇవాళ వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం నిలిపేసింది. దీంతో కాకినాడ నుంచి మెరైన్ టీమ్ను రంగంలోకి దించాలని అధికారులు నిర్ణయించారు. వారికి కబురు కూడా పంపారు. మెరైన్ టీమ్ వచ్చాక వారి పర్యవేక్షణలో బోటు వెలికతీత పనులు చేపట్టాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారులు సూచించారు.