రెండంతస్థుల ఇంటిని కుప్ప కూల్చిన సిలిండర్

Update: 2019-12-23 12:40 GMT
మదనపల్లె

చిత్తూరు జిల్లా మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది. ఇవాళ వేకువజామున మంగళవీధిలోని అమర్నాథ్ ఇంటిలో నిద్రిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలో నిద్రపోతున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాక ఇంటి పక్కన ఉన్న గేదెల షెడ్డులో ఓ గేదె మృతిచెందగా, మరో గేదె గాయపడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News