హాట్హాట్గా మారిన గన్నవరం పాలిటిక్స్.. యార్లగడ్డతో వైసీపీ కార్యకర్తల భేటీ
కృష్ణా జిల్లా గన్నవరం పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావుతో భేటీ అయ్యారు. వైసీపీ కార్యాలయం దగ్గరకు భారీగా చేరుకున్న కార్యకర్తలు వంశీ వద్దు యార్లగడ్డ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.