వైఎస్సార్ వర్థంతి సందర్భంగా అల్పాహార వితరణ
ఏపీలో దివంగత నేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో పేదలకు, నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రం జరిగింది
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి సందర్భముగా విశాఖపట్నం లోని అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ లో కొణతాల కాంప్లెక్స్ వద్ద పేదలకు రోజువారీ కూలీలకు అల్పాహార పంపిణీ చేశారు. విశాఖపట్నం వైస్సార్సీపీ పార్లమెంటరీ కార్యదర్శి కొణతాల రేవతీరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ జిమ్ అధినేత రాజెస్, వార్డ్ రీసోర్స్ పర్సన్ అచ్యుత ఇతర వాలంటీర్లు పాల్గొన్నారు.