చిత్తూరు జిల్లా రామకుప్పం ఎమ్మార్వో ఆఫీస్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నివశిస్తున్న ఐదు రైతు కుటుంబాలు తమకు న్యాయం జరగడం లేదని ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని హెచ్చరించారు. వివరాళ్లోకి వెళ్తే బాధిత ఐదు కుటుంబాలు 40 ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నారు. అయితే తమ భూములపై ఇతరులకు పాస్ బుక్లు ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఎమ్మార్వోని హెచ్చరించారు.