భార్య డబ్బులు పంపించడం లేదంటూ.. కన్న కూతుళ్ళకు నరకం చూపిస్తున్న కసాయి తండ్రి

Update: 2019-11-12 07:04 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో డబ్బు కోసం ఓ తండ్రి కన్న కూతుళ్లకు నరకం చూపించాడు. నర్సాపురం మండలం సార్వ గ్రామానికి చెందిన ఉల్లంపర్తి ఎలిషా భార్య మహాలక్ష్మి గల్ప్ లో ఉంటుంది. గల్ఫ్ నుండి భార్య డబ్బులు పంపించడం లేదంటూ తన ఇద్దరు పిల్లలను బెల్ట్ తో కొట్టి చిత్ర హింసలకు గురిచేశాడు. పిల్లలిద్దరిని కొడుతున్న వీజువల్స్ భార్యకు పంపించాడు. మహలక్ష్మీ బంధువులు పిల్లలను తీసుకెళ్లారు. ఎలీషా పరారీలో ఉన్నాడు. ఎలీషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Tags:    

Similar News