వశిష్ట బోటు ఒడ్డుకు చేరుకోవంతో బోటులో చిక్కుకున్న మృతదేహలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ఐదు మృతదేహలను వెలికితీసిన ధర్మాడి సత్యం టీమ్ బోటులో మరికొన్ని మృతదేహలను ఉన్నట్టు గుర్తించారు. దీంతో ధర్మాడి బృందానికి సాయంగా మరికొంత మంది సహాయక సిబ్బంది క్చచులూరు చేరుకున్నారు. బోటులో ఉన్న మృతదేహలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, బోటులో పలు మృతదేహలు లభ్యం కావడంతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు.