కచ్చులూరు దగ్గర నీటమునిగిన రాయల్ వశిష్ట బోటు ఎట్టకేలకు అధ్వాన్న స్థితిలో బయటకొచ్చింది. బోటును మొత్తంగా లంగరు ద్వారా గుర్తించి బయటకు లాగగలిగారు. ఎట్టకేలకు బోటు ఒడ్డుకు చేరుకుంది. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. శవాలు పూర్తిగా కుళ్లిపోయి అవయవాలు బయటపడుతున్నాయి. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మృతదేహాల నుంచి డీఎన్ఏ సేకరించి కుటుంబ సభ్యులతో పోల్చి మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.