ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. సచివాలయం మొత్తం రసాయన ద్రావణాలు శానిటైజ్ చేస్తున్నారు. 3,4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధించారు. దాంతో, ఈ రెండు బ్లాకుల ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఆ రెండు బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయంలోని మొత్తం ఐదు బ్లాకులను శానిటైజ్ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 76 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567 శాంపిల్స్ని పరీక్షించగా 76 మంది కోవిడ్-19 పాజిటివ్గా తేలారు. 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్తో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.