గత ప్రభుత్వ పాలనకు మా పాలనకు తేడా ఉందన్నారు ఏపీ సీఎం జగన్. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సున్నపురాళ్లపల్లెలో స్టీల్ప్లాంట్కు జగన్ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 15 వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. అంతకు ముందు సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.