సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును సీఎం జగన్ పరామర్శించారు. ఇటీవల మధు మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు. ఈ సందర్భంగా మధుతో వారిద్దరు కాసేపు ముచ్చటించారు.